పెంపుడు కుక్క మృతితో యజమాని ఆత్మహత్య

20
- Advertisement -

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్నాడు ఓ యజమాని. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్(33) అనే వ్యక్తి.

నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. అయితే అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. బాధతో కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Also Read:జాక్..రిలీజ్ డేట్

- Advertisement -