అనుష్కపై నెటిజన్ల ఫైర్‌

280
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ,టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం బీసీసీఐ షేర్ చేసిన ఓ ఫోటో. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుండగా అనుష్క కూడా అక్కడే ఉంది.

రెండో టెస్టు గురువారం నుండి ప్రారంభం కానుండగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు అనుష్క కూడా వారితో కలిసి ఫోటో దిగింది. ఈ ఫోటోనే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

anushka virat

అనుష్క టీమిండియా వైస్ కెప్టెనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అనుష్కను జట్టులోకి ఎప్పుడు తీసుకున్నారు…?అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అనుష్క క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురికావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా టీమిండియా ఓ మ్యాచ్‌లో ఓడిపోవడం,దానికి నెటిజన్లు అనుష్కనే కారణం అంటూ మండిపడటంతో కోహ్లీ సైతం స్పందించాల్సి వచ్చింది.

- Advertisement -