కాంగ్రెస్ జీవన్‌రెడ్డికి నిరసన సెగ..

9
- Advertisement -

ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జీవన్ రెడ్డి ఇంటికి ప్రచారానికి వెళ్లగా అడ్డుతగిన మహిళలు, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు.ఆసరా పెన్షన్‌ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని నిలదీశారు. కల్యాణలక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ ఓట్లడుగుతున్నారని మహిళలు ఆగ్రమం వ్యక్తంచేశారు.

జీవన్‌ రెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డు తగలడంతో ప్రచారాన్ని ముగించుకుని మధ్యలోనే వెళ్లిపోయారు.

Also Read:డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

- Advertisement -