గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌

446
Mla Annareddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. రాంపూర్ గ్రామం , సబ్బవరం మండలంలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకి ఎంతో కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 30 ,40 సంవత్సరాల తర్వాత ఏర్పడే పర్యావరణ పర్యవసనాలు దృష్టిలో పెట్టుకొని ,రానున్న కాలంలో వాతావరణం లో వచ్చే హెచ్చు తగ్గుదలను సమతుల్యత కావాలి అంటే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని సూచించారు.

- Advertisement -