ప్చ్.. ఆదిపురుష్ పై మళ్లీ కసరత్తులు

41
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” సినిమా రాబోతుంది. దీనికితోడు, బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఐతే, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా బెటర్ అవుట్ పుట్ కోసం మేకర్స్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై మళ్లీ ఫుల్ ఫోకస్ పెట్టారు.

ఐతే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలు టైం మాత్రమే ఉంది. మరి అప్పటి లోపు విఎఫ్ఎక్స్ పనులు పూర్తి అవుతాయా ? లేదా ? అనేది పెద్ద డౌట్ గా ఉంది. మరి ఓం రౌత్ అండ్ టీం చివరకు ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ కి కృతిసనన్ జోడీగా నటిస్తోంది. అన్నట్టు ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు. అంటే.. నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదికావ్యంయం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : మరీ ఇలా ఐతే ఎలా ?

పవన్ సినిమా నుండి లీకులు

ఎన్టీఆర్ తో మహేష్.. ఆశ్చర్యం !

- Advertisement -