ఫ్యాన్స్ రిక్వెస్ట్ లైట్ తీసుకున్న పవన్ ?

156
- Advertisement -

కొన్ని నెలల క్రితం హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ సినిమా ఎనౌన్స్ అయింది. ఆ వెంటనే భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ప్రకటించి ప్రాజెక్ట్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచారు. కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఎదురుచూశారు.

కట్ చేస్తే ఇప్పుడు పవన్ ఆ కథను పక్కన పెట్టేసి హరీష్ కి మరో రీమేక్ కథ అప్పగించాడట. అవును మొన్నటి నుండి సోషల్ మీడియా లో వినిపిస్తున్న కోలీవుడ్ తేరి సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు పవన్. తమిళ్ లో విజయ్ హీరోగా 2016 లో వచ్చిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ రీమేక్ కి అంతా సిద్దమైంది. ఇవ్వాలో రేపో ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.

హరీష్ శంకర్ కొన్ని మార్పులతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ – హరీష్ సినిమాను ఎనౌన్స్ చేసిన మైత్రి నిర్మాతలే ఈ రీమేక్ ను తీయబోతున్నారు. ఇప్పటికే పవన్ చాలా రీమేక్ సినిమాలు చేశాడు. తాజాగా భీమ్లా నాయక్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ మాత్రం కొన్ని రోజుల నుండి పవన్ ఇక రీమేక్స్ పక్కన పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తేరి రీమేక్ చేయడం పవన్ అభిమానులకు ఇష్టం లేదు. మరి ఫ్యాన్స్ వద్దన్నా పవన్ ఎందుకు ఈ రీమేక్ సినిమాను చేస్తున్నాడో తనకే తెలియాలి.

ఇవి కూడా చదవండి…

సాయి తేజ్.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా

BB6..ఇంటి సభ్యులకు జాక్‌పాట్

- Advertisement -