పవన్ వడ్డీ గోల.. మళ్లీ అవే గుసగుసలు !

87
pawan
- Advertisement -

సినిమా వాళ్ళ పై రూమర్లు రుచిగా ఉంటాయి. కానీ, పర్సనల్ జీవితాలను ఇబ్బంది పెట్టేంత రుచి మీడియాకి అవసరమా ?, ‘తమన్నా పెళ్లి గోల’ అంటూ కొన్ని రోజుల క్రితం ఓ ఎపిసోడ్ కి టైటిల్ కూడా పెట్టారు. ఆ రేంజ్ లో తమన్నా పెళ్లి పై ప్రచారం జరిగింది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉంటుంది వెబ్ మీడియా వ్యవహారం. ఇక ఇండస్ట్రీలో గాసిప్స్ బాపతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ లు ఉండవు. కానీ, సెలబ్రిటీలపై ద్వేషాన్ని చిమ్మితే ఎలా ?, ఆ మధ్య ఓ స్టార్ హీరోయిన్ మొగుడ్ని వదిలేసింది అంటూ పుకార్లు పుట్టించారు. రీసెంట్ గా ఓ పెద్ద స్టార్ హీరోగారి కూతురు లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయింది అంటూ వార్తలు అల్లారు. ఆ మధ్య అయితే, ఓ ప్రముఖ హీరో ఏకంగా చనిపోయాడు అంటూ ఫోటోకు ఫోటోషాప్ లో దండ వేసి ఓ దిక్కుమాలిన వార్తను వైరల్ చేశారు. ఇదే క్రమంలో గత వారం సానియా మీర్జా, ఆమె భర్త మాలిక్ విడిపోయారు అని, ప్రస్తుతం వాళ్ళు విడిగా ఉంటున్నారనీ కొన్ని సైట్స్, చానెళ్లు కారుకూతలు కూశాయి.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ను డబ్బు డిమాండ్ చేస్తోంది అంటూ ఒక రూమర్ పుట్టించారు. మైత్రీ మూవీస్-పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఆ మధ్య ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. ఐతే, ఆ తర్వాత ఈ సినిమా అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఈ క్రమంలోనే మైత్రీ పవన్ కి ఇచ్చిన రెండు కోట్ల అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోందట. పైగా అడ్వాన్స్ వెనక్కు ఇవ్వడం అంటే వడ్డీ కూడా ఇవ్వాల్సి వుంటుంది అని మైత్రీ సంస్థ మొహమాటం లేకుండా క్లారిటీ ఇచ్చిందని ఓ వార్త వండారు. ఐతే, ఈ వార్తలో అసలు వాస్తవమే లేదు. తోచినట్టు రాసి పారేసే వాళ్లను ఎలా ఆపాలి ?, అసలు ఇలాంటి శృతి మించిన గుసగుసలే సినిమా వాళ్ళ కన్నీళ్లుకు, రుసరుసలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వార్తల పై ఎంతమంది బుసబుసలాడిన ఈ గుసగుసలు మాత్రం ఆగడం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -