ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాటపట్టారు. నేటి నుండి రెండు రోజుల పాటు అరకులోని గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు పవన్. గిరిజనులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష జరపనున్నారు.రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధుల కేటాయింపు, వైద్య సేవల అందుబాటు, విద్యా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
తన పర్యటన ద్వారా గిరిజన జనజీవితాన్ని దగ్గర నుంచి అర్థం చేసుకుని, వారి అభివృద్ధికి దోహదపడే ప్రణాళికలు రూపొందించనున్నట్టు సమాచారం. అలాగే గిరిజన గ్రామాలకు బెటర్ కనెక్టివిటీ కల్పించేందుకు ఇప్పటికే చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో చర్చించనున్నారు.
Also Read:ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్ రావు