పవన్ కు ఆ ట్యాలెంట్‌ లేదట…

197
- Advertisement -

భారత సినీ రంగంలో అత్యున్నత దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు.. సినీ నటుడు పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉదయం విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన పవన్‌, త్రివిక్రమ్‌ ఆయన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.  అనంతరం పవన్‌,త్రివిక్రమ్‌ లు విశ్వనాథ్‌తో కాసేపు ముచ్చటించారు. అనంతంరం మీడియాతోమాట్లాడిన పవన్‌ కళ్యాణ్…
  Pawan Kalyan and Trivikiram Met and Congrtulated K Vishwanath
విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే దక్కడం ఆ పురస్కారానికే గౌరవమని అన్నారు. విశ్వనాథ్‌ వల్లనే తనకు సంస్కృతి, కళల పట్ల అవగాహన వచ్చిందని, ఆయన చిత్రాల్లో శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలు తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా శంకరాభరణం సినిమా ఎన్నిసార్లు చూశానో గుర్తేలేదని, అంతలా ఆ సినిమా నచ్చిందన్నారు పవన్‌ కళ్యాణ్‌.

స్వయంకృషి చిత్ర షూటింగ్‌ సమయంలో విశ్వనాథ్‌తో పరిచయం ఏర్పడిందని..అయితే ఆయన చిత్రంలో నటించే ప్రతిభ తనకు లేదని భావించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా నిన్న విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -