పీఠాపురం బరిలో పవన్..

33
- Advertisement -

ఎట్టకేలకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటాచేస్తాననే దానిపై స్పష్టత ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. మంగళగిరిలో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన పవన్…పీఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఎంపీగా పోటీ చేస్తాననే దానిపై నిర్ణయం తీసుకోలేదని, పెద్దలను సంప్రదించి ఎంపీగా పోటీ చేయాలా వద్దా అన్న దానిపై ప్రకటిస్తానని చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు.

2019లో భీమవరం, గాజువాక రెండు స్థానాల నుండి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. వైసీపీ తరపున వంగ గీత బరిలో ఉండటంతో పవన్‌కు టఫ్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు.

Also Read:టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -