‘ఖుషి’తో ఫ్యాన్స్ ఖుషీ !

1408
- Advertisement -

న్యూ ఇయర్ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ మూవీ ఈరోజు రీరిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొత్త సినిమా మాదిరి కటౌట్లు పెట్టి, పవన్ చిత్రపటానికి పాలాభిషేకాలు, బాణాసంచా కాల్చి రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూసి ఖుషీ అవుతున్నారు. 22ఏళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పైగా ఖుషీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో పోకిరి రికార్డు బ్రేక్‌ అయింది.

కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌ రూపంలోనే ఖుషీ సినిమాకు ఇప్పటి వరకు నైజాంలో కోటీ, ఆంధ్రాలో 65 లక్షలు, ఓవర్సీస్‌ అండ్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో 15 లక్షలు వచ్చాయి. టోటల్‌గా కోటీ 80 లక్షలు వచ్చాయి. దాంతో పోకిరి రీ-రిలీజ్‌ ఫైనల్‌ కలెక్షన్‌లు(1.7 కోట్లు)ని ఖుషీ బ్రేక్‌ చేసింది. ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, మొత్తానికి ఈ మూవీని గ్రాండ్ గా రీరిలీజ్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్.జే సూర్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పవర్ స్టార్ పై క్రేజీ కామెంట్స్ చేశాడు.

ఇంతకీ ఎస్.జే సూర్య ఏం మాట్లాడాడు అంటే.. ‘పవన్ కళ్యాణ్ ని నేను మొదటిసారి చూసినప్పుడు, చిన్నపిల్లాడి లాగా ఒక టేబుల్ పైన కార్ బొమ్మ పెట్టి దానితో ఆడుకుంటూ ఉన్నాడు అని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఖుషీ రీరిలీజ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి…

2022…విషాదాలతో ముగిసిన సినీ పరిశ్రమ

అంతా కన్నడ ప్రభంజనమే .!

జనవరి నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’

- Advertisement -