పవన్ దర్శకులకు మంచి రోజులు

37
- Advertisement -

గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన గురించే హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి రాజ‌కీయాల‌తో పాటూ, సినిమాలు కూడా చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఏడాది చివ‌ర నాటికి త‌న క‌మిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట. రీసెంట్‌గా వినోదాయ సీతం రీమేక్ షూట్ కంప్లీట్ చేసుకున్న ప‌వ‌న్ కళ్యాణ్ మిగిలిన సినిమాలను కూడా అంతే స్పీడ్ గా పూర్తి చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ ఇవాళ ప్రారంభ‌మైంది.

హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ట్విట్ట‌ర్‌లో ఓ సాంగ్ క్లిప్‌ను ట్వీట్ చేస్తూ తెలిపాడు. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం ఈనాడే ఎదుర‌వుతుంటే అని త‌న భావాల‌ను ఆ ట్వీట్‌లో తెలియ‌చేశాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా వేగంగా తన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వంలో రానున్న ఓజీ మూవీ షూట్‌లో కూడా పాల్గొన‌నున్నాడు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వరుసగా వరుసగా డేట్స్ కేటాయించాడు. ఈ నెల 15 నుంచి మొద‌లై, దాదాపు 2 నెల‌ల పాటూ షూటింగ్ జ‌ర‌గ‌నుందని టాక్. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ వరుసగా డేట్స్ ఇవ్వడం విశేషం. ఏది ఏమైనా పవన్ దర్శకులకు మంచి రోజులొచ్చాయి.

ఇవి కూడా చదవండి…

పుష్ప 2 టీజ‌ర్.. ర‌ష్మిక క్యూట్ లుక్

బలగంకి ఆస్కార్.. ప్చ్ విచిత్రం

లాభాల్లోకి దసరా.. పూర్తి లెక్కలివే

- Advertisement -