BRO:ఆ 20 నిమిషాలే కీలకమా!

23
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం బ్రో. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

ఇప్పటికే పవన్ సన్నిహితులు సినిమా చూడగా చివరి 20 నిమిషాలు హైలెట్‌గా నిలస్తుందట. ప్రేక్షకులు బయటకి బరువెక్కిన హృదయంతో వస్తారని, క్లైమాక్స్ లో భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయని చెబుతున్నారు. అలాగే తేజ్ – పవన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సినిమా మొత్తానికి చివరి 20 నిమిషాలు హైలైట్‌గా నిలవనున్నాయట.

Also Read:Pushpa 2:ఇంట్రెస్టింగ్ న్యూస్

ఇక పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారో అంతకంటే ఎక్కువగానే విజువల్ ట్రీట్ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా తమిళ సినిమా వినోదయ సితంకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ కేతిక శర్మ , ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -