టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి నామీనేషన్..

76
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, సుంకరీ రాజు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చలిక చంద్రశేఖర్ మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో నామీనేషన్లు వేశారు. పట్నం మహేందర్ రెడ్డి మూడు సెట్లు, సుంకరీ రాజు రెండు సెట్లు, చలిక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -