కొరటాల నిజాయితీ ఏంటో… : పరుచూరి

226
- Advertisement -

‘భరత్‌ అనే నేను’ మూవీ సక్సెస్‌ టాక్‌ తో దూసుకుపోతోంది. రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతూ..ఆడియెన్స్‌ మన్ననలు పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ సరసన నటించిన కైరా అద్వానీ బాగా ఆకట్టుకుంది. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  Paruchuri Gopala Krishna Reveals The THEME of Mahesh Babu's ...

తాజాగా..పరుచూరి గోపాలకృష్ణ కూడా రియాక్ట్ అయ్యాడు.పరుచూరి పలుకులు పేరుతో నడుస్తున్న ప్రోగ్రామ్‌లో ‘భరత్ అనే నేను’ గురించి మాట్లాడారు. సినిమా యూనిట్ మొత్తాన్ని అభిననందించడమే గాక స్పెషల్‌గా కొరటాల శివ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ‘‘ఈ సినిమా చూస్తే ఆయన కమర్షియల్ సినిమా చేయలేదని అర్థమైపోతుంది. ఈ సినిమాలో వచ్చే జాతర సందర్భమే దానికి మంచి ఉదాహరణ. సాధారణంగా జాతర సీన్ సందర్భంలో ఐటెం సాంగ్ పెట్టేందుకు మక్కువ చూపుతారు కొంతమంది దర్శకులు. కానీ కొరటాల మాత్రం అది చేయలేదు. ఆడియన్స్ మూడ్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు. ఇదే కరెక్ట్. ఈ విషయాన్ని నా పక్కనే కూర్చొని చూస్తున్న మా అమ్మాయికి కూడా చెప్పాను. సినిమా చూస్తే కొరటాల నిజాయితీ ఏంటో తెలిసిపోతోంది’’ అన్నారు.

- Advertisement -