- Advertisement -
అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు మాట్లాడరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో రైతులకు అందించే సహాయంపై మోదీ అబద్దాలతో నమ్మిస్తున్నారని అన్నారు. 11కోట్ల మంది రైతులకు నగదు సహాయం ఇస్తున్నామని చెప్పారని… కానీ నిజానికి కేంద్రం 3.87కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందని కవిత అన్నారు.
యేటా నగదు సాయం లబ్దిపొందే రైతుల సంఖ్యను కేంద్రం కుదించుకుపోతుందని దానివల్ల రైతులే నష్టపోతున్నారన్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి.. విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. అదానీ వ్యవహారంపై వస్తున్న విమర్శలు జవాబు చెప్పలేదని విమర్శించారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి…
ప్రతిపక్షాలకు చుక్కలు చూపించిన..
రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన జీవీకే…
షాకిచ్చిన ఆర్బీఐ…
- Advertisement -