నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు

349
Parliment
- Advertisement -

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.  ఇవాళ ఉదయం 11గంటలకు  ప్రారంభంకానున్న ఈసమావేశాలు ఎప్రిల్ 3వ తేది వరకు జరుగనున్నాయి. 21 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

ఢిల్లీ అల్లర్లకు కేంద్రహోం మంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను కేంద్రం పెట్టనుంది. జనవరి 31న మొదలైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరిగాయి. మళ్లీ ఇప్పుడు మొదలై ఏప్రిల్ 3 వరకు కొనసాగుతాయి.

- Advertisement -