న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఓటమిపాలయ్యింది. కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను కివీస్ గెలుచుకుంది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 242 పరుగులకు ఆలౌట్ అయింది టీంఇండియా. ఆతిధ్య జట్టును కేవలం 235 పరుగులకే ఔట్ చేసి 7 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ విజయానికి 132 పరుగులు అవసరం కాగా మూడు వికెట్లను కోల్పోయి విజయాన్ని దక్కించుకుంది కివీస్.
రెండో ఇన్నింగ్సులో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 90 పరుగుల ఓవర్ నైట్ స్కోరు దగ్గర మూడో రోజు సోమవారం బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్లు ఆడి 34 పరుగులు చేసింది. మూడో రోజు ఆట మొదలవ్వగానే హనుమ విహారి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 95పరుగుల వద్ద రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మొహమద్ షమీ (5), జస్ప్రీత్ బుమ్రా (4) రన్ అవుట్ అయ్యారు. రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. న్యూజిలాండ్ తో 5టీ20ల్లో గెలిచిన టీంఇండియా వన్డే, టెస్ట్ మ్యాచ్ లలో చేతులేత్తేసింది.