సినీ నటుడు పరేశ్‌ రావల్‌కు కరోనా..

162
paresh rawal
- Advertisement -

మరో బాలీవుడ్ నటుడు కరోనా బారీన పడ్డారు. రెండు రోజుల క్రితం అమీర్‌ ఖాన్‌కు కరోనా సోకగా హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నటుడు పరేశ్‌ రావల్‌ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. 65 సంవత్సరాల పరేష్‌ రావల్‌ మార్చి 9న కొవిడ్‌ తొలి డోస్‌ తీసుకున్నారు.

పరేష్‌ రావల్‌ చివరి సారిగా డేవిడ్‌ ధావన్‌ చిత్రం కూలీ నంబర్‌ 1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన హంగామా-2లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో నటులు ఆర్ మాధవన్, రోహిత్ సరఫ్, కార్తీక్ ఆర్యన్ వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.

- Advertisement -