మహబూబ్‌నగర్‌లో పారా మోటరింగ్ స్పోర్ట్స్….

200
srinivas goud
- Advertisement -

తెలంగాణ పర్యాటక శాఖ అధ్వర్యంలో రాష్ట్రంలో తోలిసారిగా పారా మోటరింగ్ , స్కైడ్రైవింగ్ , హాట్ ఎయిర్ బేలూన్స్ మరియు ఆర్ సి డ్రోన్స్ లాంటి ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి చాంపియన్ షిప్ ను మహబుబ్ నగర్ పట్టణం వేదిక గా నిర్వహించటం ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన పత్రికా సమావేశంలో మహాబుబ్ నగర్ జిల్లా కలేక్టర్ శ్రీ వెంకట రావు తో కలసి ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పర్యాటక శాఖ ద్వారా ఎన్నో విన్నూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఈలాంటి పారా మోటరింగ్ ఎయిర్ స్పోర్ట్స్ మోట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితం అయ్యేవన్నారు.తెలంగాణ పర్యాటకశాఖ అధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ధినోత్సవం, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈలాంటి ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహించామన్నారు. ఈ పర్యాయం జాతీయ స్థాయిలో ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహించటం రాష్ట్రం లో ఇదే తోలిసారని మంత్రి వెల్లడించారు. పారా మోటరింగ్ స్పోర్ట్స్ కు మహబుబ్ నగర్ పట్టణం ఎంతో అనుకూలంగా ఉందన్నారు.

ఈ ఎయిర్ స్పోర్ట్స్ ను సంక్రాతి పండుగ సందర్భంగా జనవరి 13 నుండి 17 వరకు సుమారు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో దేశంలోని ప్రముఖ పారా మోటర్ గ్లైండర్ క్రీడాకారులు పాల్గోంటారన్నారు.ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో థాయ్ లాండ్ లో నిర్వహించిన ఇంటర్ నేషనల్ పారా మోటరింగ్ చాంపియన్ షిప్ లో పాల్గోని క్వాంస పథకం సాధించిన టీం సభ్యలు పాల్గోంటున్నారన్నారు.గతంలో మహబుబ్ నగర్ జిల్లా వలసలకు పెట్టింది పేరు గా గత ప్రభుత్వాలు నిలిపాయి. నేడు శరవేగంగా మహబుబ్ నగర్ పట్టణము అభివృద్ది పథంలోదూసుకపోతున్నా నేపథ్యంలో ఇలాంటి ఎయిర్ షో లు జరగటం వల్ల గ్రామీణ స్థాయి యువత కు కోత్త అనుభూతిని కల్గిస్తుందన్నారు. 

ఈ ఎయిర్ స్పోర్ట్స్ లోఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా తో పాటు హైదరాబాద్ మరియు వివిధ రాష్ట్రాల, వివిధ ప్రాంతాలలోని యువత ఈఎయిర్ స్పోర్ట్స్ అడ్వేంచర్ గేమ్స్ చూడటానికి పెద్ద ఏత్తున తరలిరానున్నారు. అందుకు టూరిజం శాఖ , జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ ను పూర్తి శిక్షణ పోందిన నిపుణులచే టేకాఫ్ మరియు సెల్ప్ ల్యాడింగ్ లాంటివి నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సాహసోపేతమైన ఆటలు యువతకు మంచి అనుభూతిని ఇస్తాయన్నారు. ఈ పారా మోటరింగ్ లో పాల్గోనడం ద్వారా సాదరణ విపత్తులు మరియు వైద్య విపత్తుల్లో ఎలో స్పందిస్తారో వాళ్ళ కష్టాలేమిటో స్వయంగా తెలుసుకోవచ్చుని వెళ్లడించారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో విజయం సాధించిన మెదటి మరియు రెండవ స్థానం సాధించిన వారు భవిష్యత్ లో నిర్వహించే అంతర్జాతీయ పారా మోటరింగ్ చాంఫియన్ షిప్ లో పాల్గనే అవకాశం ఉందన్నారు. 

ఈఎయిర్ స్పోర్ట్స్ లో సాధరణ ప్రజలు 10 నిమిషాల పారా మోటరింగ్ అక్టివిటిలో పాల్గోగోనేందుకు 1500 రూపాయల కనీస చార్జీ ని నిర్ణయించామన్నారు. వీటితో పాటు హాట్ బెలూన్ జాయ్ రైడ్ లో పాల్గోనే వారికి 500 రూపాయల చార్జీ ని నిర్ణయించటం జరిగింది. ప్రజలందరూ ఇలాంటి ఎయిర్ స్పోర్ట్స్ ను మద్దతు తెలిపి స్వచ్చందంగా పాల్గోనాలని పిలుపునిచ్చారు.మహబుబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ కల్పిస్తున్నగోప్ప అవకాశం ను ప్రజలందరూ వినియేగించుకోని సంతోషంగా ఉండాలని ఈఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహిస్తున్నాము.  మహబుబ్ పట్టణము నకు కూతవేటు దూరంలో అంతర్జాతీయవిమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్ లో ఇంకా అభివృద్ది చేస్తున్నాము. పరిశ్రమల , ఐ టి శాఖ మంత్రి శ్రీ కె టి రామారావు గారు సారధ్యంలో పారిశ్రామికంగా జిల్లాకు ఐటి కంపనీలు, ఫార్మా కంపనీలు, భారీ పరిశ్రమలు ఇప్పటికే పెట్టుబడులు పేట్టడానికి క్యూ కట్టుతున్నాయి. భవిష్యత్ లో మహబుబ్ నగర్ పట్టణం లో మరేన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలకు వేదిక అయ్యే అవకాశం వుందన్నారు.ఇప్పటికే క్రీడాకారుల ఉత్పిత్తి కేంద్రంగా, ఎన్నో క్రీడా  అకాడమీలకు కేంద్రంగా ఉంది.రాష్ట్రంలో, దేశంలో మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు ఎంతో సత్తా చాటి రాష్ట్రం , దేశం పేరు ప్రఖ్యాతులు తీసుకవస్తున్నారని వెల్లడించారు.ఈకార్యక్రమములో వర్టికల్ వరల్డ్ అడ్వేంచర్ మరియు ఎయిరోస్పోర్ట్స్ వ్వవస్థాపకులు శ్రీ సుకుమారు , జగదీష్ రెడ్డి, డా. వెంకట్ రావు లు పాల్గోన్నారు.

- Advertisement -