పాన్ ఇండియా హీరోల సంక్రాంతి పోటీ!

24
- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతికి సీనియర్ హీరోలు చిరు , బాలయ్య ‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. యావరేజ్ టాక్ తో కూడా భారీ వసూళ్లు అందుకున్నారు. అయితే వచ్చే ఏడాది కూడా గట్టి పోటీ ఉండబోతుంది. ఈసారి పాన్ ఇండియా హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ Kను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి రిలీజ్ అంటూ ఆఫీషియల్ గా ప్రకటించేశారు.

రామ్ చరణ్ -శంకర్ కాంబో సినిమా కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం యూనిట్ సంక్రాంతి టార్గెట్ గా పని చేస్తుంది. ఇప్పటికే అరవై శాతం పైన ఘాట్ కంప్లీట్ అయింది. ఈ ఏడాది చివరి వరకూ శంకర్ కి టైమ్ ఉంది. ఈ లోపు మిగతా వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

ఇక ‘పుష్ప 2’ కూడా సంక్రాంతికే రానుందని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తుంది. మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ సుక్కు అండ్ టీం సంక్రాంతి రిలీజ్ అని ఫిక్సయ్యారని సమాచారం. చరణ్ , బన్నీ సంక్రాంతి పోటీ అని సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. చరణ్ సినిమా సంక్రాంతి ఫిక్సయినట్టే, మరి బన్నీ విషయమే తేలాల్సి ఉంది. సుకుమార్ స్లో అండ్ స్టడీ మెథడ్ ను ఫాలో అవుతూ ఈ సీక్వెల్ ను చెక్కుతూ తీస్తే సంక్రాంతికి రావడం కష్టమే.

ఇవి కూడా చదవండి…

ఆ విషయంలో తృటిలో తప్పించుకున్నా..!

నాటు నాటు సాంగ్ లైవ్‌..ఎందులో తెలుసా..!

‘ఉస్తాద్’ మొదలు పెట్టనున్న పవన్?

- Advertisement -