గీత కార్మిక ఆర్ధిక సహకార సంస్థ చైర్మన్‌గా పల్లె..

39
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్‌ … రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

రవికుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బొడంగిపర్తి. తండ్రి పల్లె లింగయ్య మాజీ సర్పంచ్. ప్రస్తుతం ఆయన సతీమణి కళ్యాణి గౌడ్ చండూరు ఎంపీపీగా ఉన్నారు. జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.ఎన్నో అద్భుతమైన కథనాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులందరినీ ఏకంచేసి పోరుబాట పట్టించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.

Also Read:బీఆర్ఎస్ ఆవిర్భావ హైలైట్స్‌..

మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు నిలిచారు. స్వరాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.

Also Read:Harishrao:రాజ్యాంగంలో రాసుందా?

- Advertisement -