బీ ఫామ్ అందుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి..

208
palla
- Advertisement -

ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బి-ఫామ్ అందజేశారు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్‌లో కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్‌ని అందుకున్న పల్లా…ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

సిట్టింగ్ స్ధానం నుండి మరోసారి బరిలోకి దిగుతున్నారు పల్లా. ఎమ్మెల్సీతో పాటు ప్రస్తుతం రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. వామపక్ష విద్యార్ధి సంఘంలో పనిచేసిన పల్లా…ప్రజా సమస్యలపై తన గళాన్ని మండలిలో సమర్ధవంతంగా వినిపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరోసారి పల్లాకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

- Advertisement -