స్వరాష్ట్రంలో ప్రగతిపథంలో తెలంగాణ: పల్లా

224
palla rajeshwar reddy
- Advertisement -

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంని పురస్కరించుకొని ఇవాళ ఉదయం, తెలంగాణ రైతు బంధు సమితి కార్యాలయం, నందు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు పల్లా రాజెశ్వర్ రెడ్డి.

ఈ సందర్బంగా స్వరాష్ట్రం సాధించి ప్రగతి ప్రస్థానంలో సగర్వంగా ఆరేళ్ళు పుర్తి చేసుకొని ఏడవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి విప్ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి.జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పద్మావతి,ఎంపీ రాములు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి,కలెక్టర్ శ్రీధర్, ఎస్పి సాయిశేఖర్ పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు..

సూర్యాపేటలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జండాను ఎగురవేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ ,శనంపూడి సైది రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జు దీపికా యూగేందర్ రావు.., జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -