రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా

499
Palla Rajeshwar Reddy
- Advertisement -

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం చేపట్టనున్నట్లు వెల్లడించారు. జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితి బలోపేతం చేయనున్నారు.

త్వరలోనే రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. తన మీద నమ్మకంతో ఈపదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి మొట్టమొదటి అధ్యక్షుడిగా గుత్తా సుఖెందర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఇటివలే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్ అనంతరం మండలి చైర్మన్ గా నియమించారు. దీంతో రైతు సమన్వయ సమితి పదవిని పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు.

Palla Rajeshwar Reddy Appoineted As Rythu Samanvayasamithi President
- Advertisement -