కాంగ్రెస్‌కు మరోషాక్‌..టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే

271
paleru mla upender reddy
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,రేగ కాంతారావు,హరిప్రియ నాయక్‌,చిరుమర్తి లింగయ్య,సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించగా తాజాగా ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరిపోయారు.

ktr

ఖమ్మం జిల్లాకు చెందిన పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరిత తెలంగాణలో భాగంగా కేటీఆర్‌కు మొక్కను బహుమానంగా అందజేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఉపేందర్ రెడ్డి చేరికతో కాంగ్రెస్‌కు గట్టిషాక్ తగలనుంది.

- Advertisement -