CM KCR:సంపూర్ణం కానున్న బంగారు తెలంగాణ

25
- Advertisement -

పాలమూరు ఎత్తిపోథల పథకం పూర్తికావడంతో బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందన్నారు సీఎం కేసీఆర్. పాలమూరు ఎత్తిపోథల పథకంపై రివ్యూ నిర్వహించిన అనంతరం మాట్లాడిన సీఎం..ఈ నెల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుందని తెలిపారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అన్నారు సీఎం. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత జరుగుతుందని…
ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి జనసమీకరణ చేయాలన్నారు సీఎం.

ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల లోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు గ్రామ సర్పంచులు, ప్రజలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామన్నారు. దక్షిణ తెలంగాణ కు పండుగ రోజని…ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు.

Also Read:పిక్ టాక్:ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అందాలు

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని…పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంవో అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

Also Read:తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం..

- Advertisement -