పాలకుర్తి దేవాలయం..మహిమాన్వితం

131
dayakarrao
- Advertisement -

పాలకుర్తి దేవాలయం మహిమాన్వితమైందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తిలోని స్వయంభు శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న అఖండ దీపోత్సవ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆహ్వానించారు ఆలయ పాలక మండలి. అనంతరం మంత్రి ఎర్రబెల్లి అఖండ దీపోత్సవ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు.

ప్రతీ ఏటా కార్తీక మాసంలో జరిగే అఖండ దీపోత్సవం అత్యంత అద్భుతంగా జరుగుతుందన్నారు. ఇప్పటికే దేవాలయ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వీరమనేని.యాకంత రావు, పురోహిత జేఏసీ సంఘం అధ్యక్షులు డివిఆర్ శర్మ, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆలయ పర్యవేక్షకులు కొత్తపెల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఒకే సారి 32 మందితో వీడియో కాల్‌!

ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

బిచ్చగాడు-2 ఎప్పుడంటే…

- Advertisement -