లావైనా భామలు వీళ్లే…అయిన హిట్టు

210
- Advertisement -

సినిమాల్లో చిన్నపిల్లలు బొద్దుగా కనిపిస్తే ముద్దుగా ఉంటారు. కానీ హీరోయిన్‌లు బొద్దుగా ఉంటే అందంగా ఉంటారా?ముద్దుగా ఉంటారా?ఒకవేళ ఉంటే హీరోకి నచ్చుతుందా. అని నిర్మాతలు డైరెక్టర్‌లు ఆలోచిస్తారు. కానీ కొన్ని సినిమాల కోసం హీరోయిన్‌లు బోద్దుగా కనిపిస్తారు. పాత్ర కోసం ఎంతటి కష్టమైన భరించి మళ్లీ పాత్రల కోసం నాజుగ్గా కనిపిస్తారు. వారు ఎవరో మీకు తెలుసా…ఓసారి లుక్కేయండి మరీ.

డబుల్‌ ఎక్స్‌ఎల్‌
డబుల్‌ఎక్స్‌ఎల్‌ సినిమా కోసం సోనాక్షి సిన్హా దాదాపుగా 17కిలోల బరువు పెరిగారు. అందులో సహానటి అయిన హ్యూమాఖురేషి ఏకంగా 20కిలోల బరువు పెరిగింది. ఈ సినిమా నవంబర్‌4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నట్టు ఇందులో భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ నటిస్తున్నారు. మరేందుకు ఆలస్యం.

మిమీ
మిమీ సినిమా కోసం కృతి సనన్‌ సరోగసి తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం 15కిలోల బరువు పెరిగి మళ్లీ ఆదిపురుష్‌లో నటించింది.

తలైవి
తలైవి కోసం కంగనారనౌత్‌ ఏకంగా20కిలోల బరువు పెరిగింది. ఏందుకంటే తమిళనాడు మాజీ సీఎం దివంగత నటి జయలలిత బయోపిక్‌ఆధారంగా తీసిన తలైవి కోసం బరువు పెరిగింది. అన్నట్టు జయలలిత కూడా కొంచెం బొద్దుగా ఉందిలే…అందుకే మరీ

ధమ్‌లగా కే హైషా
ధమ్‌లగా కేహైషా సినిమా కోసం భూమిపడ్నేకర్‌ ఏకంగా 30కిలోల బరువు పెరిగి మళ్లీ సినిమా పూర్తవ్వగానే 35కిలోల బరువు తగ్గి నాజుగ్గా తయారైంది.

డర్టీ పిక్చర్‌
డర్టీ పిక్చర్‌ కోసం విద్యాబాలన్‌ 12కిలోల బరువు పెరిగింది. దక్షిణాది తారా సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం విద్యాబాలన్‌ బరువు పెరిగారు. సినిమా పూర్తైన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తోంది.

సైజ్‌జీరో
సైజ్‌జీరో కోసం దేవసేన 20కిలోల బరువు పెరిగింది. మరియు బహుబలి2లో దేవసేన పాత్రలో కూడా కొంచెం బొద్దుగా కనిపించింది ఈ స్వీటీ.

కేవలం సినిమాల కోసం, పాత్రల కోసం వాళ్లు తమ శరీరంను సమతూకంను మరచిపోతున్నారు. దాంతో ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్న వారు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

వెండితెర వెనుక ఎన్నో వ్యథలు

అందగత్తె కాదు మోసగత్తె :లీలానీ

శిరీష్‌తో డేటింగ్‌..నవ్వేసిన అను!

- Advertisement -