భవిష్యత్ బీఆర్ఎస్‌దే..

15
- Advertisement -

ప్రజలతోనే బీఆర్ఎస్‌కు న్యాయం జరుగుతుందని…భవిష్యత్ అంతా బీఆర్ఎస్‌దే అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల నరసయ్య, రెడ్డి రాజుల సోమయ్య తదితరులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉందన్నారు. కొత్తగా పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తూ వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో బీజేపీతో ఒరిగేది ఏమీ లేదన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -