నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ గ్రౌండ్ లో గ్రాండ్ ఆడియో రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన స్టంపర్, పైసా వసూల్ మేకింగ్ వీడియో, టైటిల్ సాంగ్ ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్లకు అభిమానులు ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘మేరా నామ్ తేడా..తేడా సింగ్..దిమాక్ తోడా..36 దోపిడీలు..24 మర్డర్లు..36 స్టాపింగ్లు..దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంది. మనది నేల టికెట్ బ్యాచ్..కసి తీరకపోతే శవాన్ని లేపి మరి చంపేస్తా అంటూ చెప్పిన డైలాగ్స్ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రియ నటిస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి…