- Advertisement -
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కంగనా రనౌత్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్కు 1947లో స్వాతంత్ర్యం రాలేదని 2014లో మోడీ వచ్చాకే స్వాతంత్ర్యం వచ్చిందని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రతిష్టను దిగజార్చేలా కంగనా మాట్లాడిందంటూ… ముంబై పోలీసులకు ఆప్ నేత ప్రీతి మీనన్ ఫిర్యాదు చేశారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. 504, 505 మరియు 124A సెక్షన్ల కింద విద్రోహ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న కంగనా రనౌత్ పై చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తూ ముంబై పోలీసులకు దరఖాస్తును సమర్పించినట్లు ప్రీతీ మీనన్ ట్వీట్ చేసింది.
మొత్తానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పబోయి అడ్డంగా బుక్కైపోయింది కంగనా.
- Advertisement -