ఒక్క సీజన్‌ గెలవలేదు..కానీ అదే ఉత్సాహం:విరాట్‌

28
- Advertisement -

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)…ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు ఒక్క సిరీస్‌ కూడా గెలవలేకపోయింది.  ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఐపీఎల్ గెలవలేదు. కానీ ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఆడిన జట్టుగా ఆర్సీబీ ఉందన్నారు. అయిన ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అభిమానులు కలిగిన జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్‌సీబీనే అని నేను నమ్ముతా..దీనింతటికి కారణం ఆర్సీబీ తరపున కమిట్‌మెంట్‌తో ఆడటమే అని విరాట్‌ చెప్పుకొచ్చారు.

 మొదటి సారి వుమెన్‌ ఐపీఎల్‌ ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఐదు జట్లు ఆడనుండగా అందులో ఆర్సీబీ జట్టు కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి..ఎట్టకేలకు యూపీ వారియర్స్‌పై విజయంతో పాయింట్ల ఖాతాను తెరిచింది. అయితే ఈ సందర్భంగా ఆర్సీబీ టీం మెంబర్స్‌కు ఒక అరుదైన అవకాశం కల్పించింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీతో ఇంటరాక్ట్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆర్సీబీ టీం నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది హల్‌చల్‌ చేస్తుంది.

ఈ సందర్భంగా విరాట్ ఫీమేల్ జట్టు సభ్యులతో మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం కప్ సాధిస్తామనే గ్యారంటీ ఇవ్వలేకపోయినా..నాణ్యమైన ఆటను మాత్రం మీరు చూసేలా చేస్తామని…అందుకు గాను 110శాతం గ్యారంటీ అభిమానులకు ఇవ్వగలం. ఫలితాల గురించి ఆలోచించకుండా విజయాల కోసం ముందుకు సాగిపోవాలని అన్నారు. ఒత్తిడిని అధిగమించి రాణించాలి. అభిమానులు నిరంతరం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారని విషయాన్ని గుర్తుంచుకొండి. వుమేన్ ఐపీఎల్ ఆడటం మీకు దక్కిన అద్భుతమైన అవకాశం…ఆటను ప్రేమిస్తూ ముందుకు సాగండి అని అన్నారు. ఫ్లేఆఫ్స్ వెళ్లేందుకు తక్కువ అవకాశాలు ఉన్నప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాకౌట్ స్టేజ్‌కు వెళ్లేందుకు ఉన్న ఒక్క శాతం ఛాన్స్‌ను మెరుగుపరుచుకోవాలి జట్టు పరిస్థితి గురించి టీమ్ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. ఇప్పటికీ మీ చేతుల నుంచి అవకాశం దాటిపోలేదు అని విరాట్ అన్నారు.

ఇవి కూడా చదవండి…

ఎట్టకేలకు బోణి కొట్టిన ఆర్సీబీ..

చల్లబడ్డ హైదరాబాద్‌…

కొవ్వును తగ్గించే ఆహార పదార్ధాలు..

- Advertisement -