సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ..

122
ktr
- Advertisement -

సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులను అభినందించారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్…రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి అని కేటీఆర్ సూచించారు.

సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటిస్తామన్నారు. ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఫ్యాక్టరీతో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

ఆయిల్ ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ . ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ ఫామ్‌ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు.

- Advertisement -