- Advertisement -
సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నెల 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్టు సమాచారం.హైదరాబాద్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మొదలుకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఓజి సినిమా బుకింగ్స్ ఈ సెప్టెంబర్ 19 నుంచే తెరుచుకోనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
Also Read:బీఆర్ఎస్వీ నేత గెల్లు అరెస్ట్
- Advertisement -

