ఎన్టీఆర్ టీం..దీపావళి విషెస్

257
ntr biopic
- Advertisement -

నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 9న ఎన్టీఆర్ సినిమా నేపథ్యంలో కథానాయకుడు,జనవరి 24న రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు రానుండగా ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్రయూనిట్.

దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని ” లేచింది నిద్ర లేచింది” పాట స్టిల్ విడుదల చేశారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది ఎన్టీఆర్ యూనిట్.

ntr biopic

ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరిని ఆకర్షించింది చిత్రయూనిట్. తాజాగా ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ సినిమాలు అందించిన దాసరి నారయణరావు పాత్రలో దర్శకుడు వివి వినాయక్ నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో గుమ్మడిగా దర్శకుడు దేవి ప్రసాద్ ,కేవీ రెడ్డిగా క్రిష్‌, విఠలాచార్యగా ఎన్‌ శంకర్‌ క‌నిపించ‌నున్నారు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాలో విద్యాబాలన్,రానా,కళ్యాణ్ రామ్,కైకాల,రకుల్,జయప్రద,ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -