ఫుల్ కిక్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్

36
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ ఇప్పటికీ జపాన్‌లోని థియేటర్లలో సందడి చేస్తోంది. RRR హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అరుదైన అవకాశాన్ని పొందారు. జపాన్‌కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ ‘ఆనన్’లో చోటు దక్కించుకున్నారు. మ్యాగజైన్‌లో ఇద్దరు హీరోలు తమదైన లుక్స్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫోటోలను జపాన్ ప్రేక్షకులు షేర్ అండ్ లైక్స్ తో జపాన్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

మొత్తానికి జపాన్‌లోని ఫేమస్ మ్యాగజైన్‌లో చరణ్ కంటే.. ఎన్టీఆర్ కే ఎక్కువ క్రేజ్ రావడం తారక్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. మే 19న తారక్ పుట్టినరోజును సందర్భంగా NTR30 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. కాగా ‘సముద్రం నిండా అతని కథలు. రక్తంతో రాసినవి’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోస్టర్‌ కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: కీర్తి.. వివరణ కాదు, నిర్ణయం తీసుకో

మరో వైపు ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా సింహాద్రి రీ-రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘సింహాద్రి’ ఈనెల 20న రీ-రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌ల‌కు పైగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా స్పెష‌ల్ షోస్ ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ రీ-రిలీజ్ ద్వారా వ‌చ్చిన లాభాల‌ను ప్రజా సేవకు ఉప‌యోగించ‌నున్నారు. మొత్తమ్మీద ఈ వరుస అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కిక్ లో ఉన్నారు.

Also Read: Nani:’మేమ్‌ ఫేమస్‌’ బాక్సాఫీస్‌ బెండ్‌ తీస్తుంది

- Advertisement -