వర్మ కంటే ముందే వస్తున్న తేజ..!

178
NTR biopic will release on may 28
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌… ప్రస్తుతం ఈ సినిమా గురించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తుండగా మరొకటి నేనే రాజు నేనే మంత్రితో మంచి జోష్ మీదున్న తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బాలయ్య నటిస్తుండగా ఈ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి తేజ ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఎన్టీఆర్ జయంతి రోజున ఈ సినిమా విడుదల అవుతుందని అంటూ, 2018 మే 28న ఈ సినిమా విడుదల కానున్నదని తేజ ప్రకటించాడు. కార్తీకమాసంలో ఈ సినిమా ఆరంభం అవుతుందని, అక్టోబర్ 20వతేదీన ఈ సినిమా షూటింగ్ అధికారికంగా మొదలవుతుందని తేజ వివరించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని వివరించాడు.

నేనే రాజు నేనే మంత్రి హిట్‌ తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు తేజ కథ సిద్దం చేసుకున్నాడు. అయితే, తేజ రాసుకున్న కథకు బదులు ఎన్టీఆర్‌ బయోపిక్‌కి కథ సిద్దం చేయాలని బాలయ్య సూచించాడట. దీంతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న తేజ…తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించాడు.

వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్…వైసీపీకి  అనుకూలంగా ఉండనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ తాను తీయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మొత్తంగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ రెండు సినిమాలు   అటు తెలుగుదేశం అభిమానులకు, ఇటు నందమూరి ఫ్యాన్స్ కు, మరోవైపు సినీ ప్రియులకు ఆసక్తిని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -