జక్కన్నతో ఎన్టీఆర్ ఆట.. వీడియో వైరల్‌..

247
- Advertisement -

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలే షూటింగ్‌ను మళ్లీ సెట్‌ మీదకు తీసుకెళ్లారు రాజమౌళి. వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆగస్ట్‌ మొదటివారంలో తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిత్యం షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉండే రాజమౌళి టీమ్‌ కాస్త విరామం దొరకడంతో వాలీబాల్‌ ఆడారు.

షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడాడు. ఇతర యూనిట్ సభ్యులు కూడా కలవడంతో, రెండు జట్లుగా విడిపోయి వాలీబాల్ మ్యాచ్ ఆడారు. అటు పక్క టీమ్‌లో రాజమౌళి, ఇటు పక్క టీమ్‌లో తారక్‌ ఆడారు. సెంటర్ ప్లేసులో నిల్చున్న ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ను అవతలి కోర్టులోకి తరలిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

- Advertisement -