దేశ్ కా నేతా కేసీఆర్: ఎన్నారైలు

89
trs
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు.ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి దాదాపు 200 లకు పైగా ఎన్నారై తెరాస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.సీఎం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్ళు ఆశీర్వదించాలని ముందుగా హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. వారంతా పూజలు, ప్రార్థనలు చేసి కేసీఆర్ గారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, రాష్ట్రాన్నే కాదు రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించి ఆశీర్వచనం అందించారు. హాజరైన అతిథులంతా కూడా ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నారు.

ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడే మన పాలకుడై నేడు సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాల్ని నేడు దేశమంతా అనుసరిస్తుందని, ఇక రాబోయే రోజుల్లో మన కేసీఆర్ గారు దేశానికి నాయకత్వం వహించాలని దేశం ఎదురుచూస్తుందని, ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి నిర్ణయం ఏదైనా వారి వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.

కేసీఆర్ గారి నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని, సందర్భం ఏదైనా వారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజాన్ని అశోక్ కోరారు.
కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని , దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని అశోక్ ప్రార్థించారు.ఖండాంతరాల్లో ఉంటూ తెరాస జెండా మోసే అవకాశం కలిపించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు ఇతర నాయకులందరికీ అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.దాదాపు పదకొండు సంవత్సరాలుగా లండన్ లో కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, నాడు లండన్ లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, మాకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ప్రపంచవ్యాప్త ఎన్నారై తెరాస ప్రతినిధులకు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.తాను ఎక్కడున్నా మాకు అన్ని రకాల సూచనల్ని సలహాలనిస్తూ ఎన్నారైలకే స్ఫూర్తిగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం గారికి అశోక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -