వనదేవతలను దర్శించుకున్న మంత్రి కేటీఆర్..

74
ktr min
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఓబుళాపూర్‌లో వనదేవతలైన సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్నారు. వ‌న దేవ‌త‌ల‌కు కేటీఆర్ నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భ‌క్తులు ఆస‌క్తి చూపారు. కేటీఆర్ కూడా వారితో క‌లిసిపోయి.. స‌ర‌దాగా సంభాషించారు. ఓ భ‌క్తురాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకుని.. దీవించింది.

- Advertisement -