లండన్‌లో బీఆర్ఎస్ జెండావిష్కరణ

97
- Advertisement -

ఇటీవల అధికారికంగా టి.ఆర్.యస్ పార్టీ బీ.ఆర్.యస్ గా మారిన సందర్భంగా అధ్యక్షులు శ్రీ కెసిఆర్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మొట్టమొదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్ లో ఎగురువేసి శ్రీ కెసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర సాధనకోసం వారి వెంట నడిచామో, అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీ.ఆర్.యస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని, నేడు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కెసిఆర్ గారి నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారని , ఎన్నారైలంతా కెసిఆర్ గారి వెంటే ఉన్నారని అశోక్ గౌడ్ తెలిపారు.

యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బీ.ఆర్.యస్ పార్టీ లో చేరి కెసిఆర్ గారి నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని వారందరిని ఆహ్వానిస్తూ,అలాగే భారత్ నుండి బీ.ఆర్.యస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తమని అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక తెలిపారు.

“దేశ్ కి నేత కెసిఆర్” “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది.కెసిఆర్ గారి ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు.మైళ్ళ దూరంలో ఉన్నా నాడు టి.ఆర్.యస్ ఉద్యమ జెండా, నేడు దేశ గతిని మార్చే మరో ఉద్యమ బి.ఆర్. యస్ జెండా మోసే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు శ్రీ కెసిఆర్ గారికి మరియు శ్రీ కేటీఆర్ గారికి కార్యదర్శి సత్య చిలుముల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృద్వి రావుల, మధు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -