వరంగల్‌లో ఎన్నారై టీఆర్ఎస్‌ ఇంటింటి ప్రచారం

182
nri trs
- Advertisement -

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో తెరాస అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 51 వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎన్నారై తెరాస బృందం తెరాస అభ్యర్థి బోయినపల్లి రంజిత్ రావు గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే అటు అభివృద్ధిలోను లేక ఆపద సమయం లోను వరంగల్ ప్రజలకు తోడున్నది తెరాస నాయకులేనని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు వరంగల్ ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని , మన తెరాస ప్రభుత్వ పాథకాలు పాలనా దేశానికే ఆదర్శంగా ఉన్నాయని మరి ఇలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత వరంగల్ ప్రజలపైన ఉన్నదని అనిల్ కూర్మాచలం మీడియా కి తెలిపారు.

సత్య మూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో వరంగల్ వచ్చి ప్రత్యక్షంగా ప్రచారం నిర్వహించామని , ప్రతీ సారి వరంగల్ లో ఎంతో అభివృద్ధిని చూసామని మరి ఇది ఇలాగే కొనసాగాలంటే తెరాస అభ్యర్ధులని భారీ మెజారిటీ తో గెలిపించి గ్రేటర్ వరంగల్ పీఠం పై గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ప్రచారానికి సహకరించిన వరంగల్ తెరాస ఇంచార్జ్ గ్యాదరి బాలమల్లు గారికి , ఎన్నికల ఇంచార్జ్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి మరియు స్థానిక నాయకులకు ఎన్నారై తెరాస నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -