కేటీర్‌కు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బిగాల..

235
minister ktr
- Advertisement -

తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని ఈరోజు ప్రగతి భవన్‌లో కలిసి ఎన్నారైల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి ప్రారంభించిన తరువాత ఎన్నారైల నుంచి చాల మంచి స్పందన వచ్చింది. దేశ విదేశాలలో వున్నా అందరూ అక్కడినుంచే వారి వారి భూముల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించినందుకు ఎన్నారైల తరపున మంత్రి కేటీర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఎన్నారైల భూములకు కూడా ఆధార్ లేకుండా ప్రక్రియ OCI కార్డు ద్వారా చేసుకోవచ్చు అని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దాని గురించి త్వరిత గతిన రూపకల్పన చెయ్యాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసారు. గల్ఫ్ పాలసీపై త్వరలో ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని అధికారక ప్రకటన చేయాలనీ కోరారు.

- Advertisement -