దర్శకుడు శంకర్‌కు చెన్నై కోర్టు షాక్‌..

185
Director Shankar
- Advertisement -

తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు. ఎందుకని షాక్ అవుతున్నారా..! అసలు విషయం ఏంటంటే..సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ భారీ విజయం సాధించిన విషయం తెలసిందే. అయితే, ‘రోబో’ చిత్ర కథ తనదే అంటూ అప్పట్లో ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ‘జిగుబా’ కథ 1996లో ఓ పత్రికలో ప్రచురితం కాగా, 2007లో నవల రూపంలో వచ్చింది.

కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు స్పష్టం చేసినా శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు వారెంట్ జారీ చేసిన చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. మరి ఈ కేసులో డైరెక్టర్‌ శంకర్‌ ఏలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -