అన్ని రంగాల్లో తెలంగాణ స్వావలంబన: మంత్రి హరీష్‌

149
minister harish
- Advertisement -

ఆదివారం ఐటీ అధికారుల‌ దత్తత గ్రామం గొంగ్లూరులో‌ గాంధీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్‌ రావు. ఈ కార్యక్రమంలో ఐటీ చీఫ్ ప్రిన్సపల్ కమిషనర్‌ ఆఫ్ ఎపీ & తెలంగాణ మహాపాత్ర, ఇతర ఐటీ అధికారులు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అంటే పన్నులు వేసే వారు అనుకుంటాం. కానీ, ఈ అధికారులు‌ గొంగ్లూరు అభివృద్ధికి శ్రమదానంతో పాటు, తమ సొంత జీతాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద చెరువును మినీ‌ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామస్థుల సహకారం అవసరం.ఐటీ‌ అధికారుల‌ సహకారంతో మంజీర సబ్బులు, మంజీర సర్ఫ్ తయారు‌చేయడం అభినందనీయం అన్నారు. పప్పుల తయారీ గిర్నీని మహిళాసంఘాలకు నా వంతుగా అందజేస్తాం. మంజీర పేరుతో‌నాణ్యమైన పప్పులు అమ్మండి అని మంత్రి సూచించారు.

అంతకుముందు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఐటీ‌ అధికారులను సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఇన్ కమ్ ట్యాక్స్,‌ ఐ.ఆర్.ఎస్ అధికారులను కలిసి మంత్రి అభినందించడం జరిగింది. నిరంతరం విధుల్లో తీరిక లేకుండా గడిపే ఐటీ‌ అధికారులు సామాజిక బాధ్యతగా గొంగ్లూరును దత్తత తీసుకుని ప్రజల‌ కోసం‌ పని చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమా, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద‌ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నైపుణ్యాన్ని, ఆ ప్రాజెక్టు వల్ల సాధించిన విజయాలను వారితో పంచుకోవడం జరిగింది. సిద్దిపేట అభివృద్ధిని వారు ఆసక్తి గా అడిగి ‌తెలుసుకోగా, అభివృద్ధి జరిగిన తీరును నేరుగా వచ్చి చూస్తామన్నారు. దానికి స్పందిస్తూ వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

- Advertisement -