ఆకలి కేకలు వినిపించొద్దు: ఎంపీ సంతోష్

259
mp santhosh
- Advertisement -

లాక్ డౌన్‌తో తెలంగాణలో ఆకలి కేకలు వినిపించొద్దు…మీ చుట్టు పక్కల ఎవరైన ఉంటే వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని సూచించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఆయన బుక్కెడు బువ్వ కరువైపాయె అంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.

స్ధానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే లింగయ్య స్పందించి వారికి నిత్యావసర సరుకులు అందించారని పేర్కొన్నారు. ఆకలి కేకలు వినిపించొద్దు…లాక్ డౌన్‌తో ఏ ఒక్కరు ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా సాయం చేయడం లేదా అలాంటి వారి సమాచారన్ని అధికారులకు అందజేయాలని సూచించారు సంతోష్‌.

- Advertisement -