కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్ ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర నిర్ణయంతో మధ్య తరగతికి బిగ్ రిలీఫ్ లభించనుంది. రూ. 18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70 వేలు మిగులు, రూ.25 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. లక్ష మిగులు ఉండనుందని తెలిపారు నిర్మలా. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను చట్టం రాబోతుందని తెలిపారు.
#UnionBudget2025 | “The middle class provide strengths to the economy. In recognition of their contribution, we have periodically reduced the tax burdens. I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs.”says Finance Minister Nirmala… pic.twitter.com/9IVCnhEUb1
— ANI (@ANI) February 1, 2025
Also Read:Budget 2025:కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం
()0 నుంచి రూ.4 లక్షల వరకు ట్యాక్స్ లేదు
()రూ.4 లక్షలు – రూ.8 లక్షల వరకు 5 శాతం
()రూ.8 లక్షలు – రూ.12 లక్షల వరకు 10 శాతం
()రూ.12 లక్షలు – రూ.16 లక్షల వరకు 15 శాతం
()రూ.16 లక్షలు – రూ.20 లక్షల వరకు 20 శాతం
()రూ.20 లక్షలు – రూ.24 లక్షల వరకు 25 శాతం
()రూ.24 లక్షల పైన 30 శాతం