దర్శనాలకు బ్రేక్…బోసిపోయిన యాదాద్రి

122
yadadri
- Advertisement -

తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బోసిపోయింది. కరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేశారు అధికారులు.

కొండ మీద కింద వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూత పడ్డాయి. దీనితో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి.. నిత్యం వేలాది భక్తజనంతో,నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళ లాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది..శ్రీ స్వామి వారి నిత్య కైకిర్యములు, ఆన్ లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా యధావిధిగా నిర్వహిస్తున్నారు అర్చకులు.

- Advertisement -