మొక్కలు నాటిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్..

164
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ ఐఏఎస్ నాల్కల్ వాటర్ ట్యాంకర్ దగ్గర మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ పక్కన మరియు జిల్లా పరిషత్ ఆఫీస్ పక్కన నర్సరీ మొక్కలు ఉచితంగా పంపిణీ జరుగుతుంది. ఎవరికైనా నర్సరీ మొక్కలు కావాలంటే వచ్చి తీసుకొని ఇంటి పక్క పరిసర ప్రాంతంలో తులసి మరియు ఆశ్వ గంధ మొక్కలు నాటవచ్చూ మరియు కరోనా టైంలో ఔషధ మొక్కల వలన మనకు ఎలాంటి వ్యాధులు రావు అని తెలిపారు.

ఇది మంచి అవకాశం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనం ఆందరం మరిన్ని మొక్కలు నాటుదాం నిజామాబాద్ గ్రీన్ సిటీగా మారుద్దాం అని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ చాలెంజ్ మరో ముగ్గురికి నిజాంపేట్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కమిషనర్లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

- Advertisement -